ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ లో తారక్, త్రివిక్రమ్ మూవీ
- March 21, 2018
జైలవకుశ వచ్చి ఆరు నెలలవుతున్నా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమా కోసమే ఇన్నాళ్ళూ వెయిట్ చేశాడు తారక్. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నాడు. తన రీసెంట్ మూవీ జైలవకుశ వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇంత గ్యాప్ తీసుకున్న తారక్, ఏప్రిల్ 12నుంచి తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారికా అండ్ హాసిని సంస్థలో రూపొందే సినిమా...నిజానికి ఎప్పుడో లాంచనంగా ప్రారంభమైంది. కానీ అజ్ఞాతవాసి నిరాశపరచడంతో త్రివిక్రమ్, మరొకసారి స్టోరీని పక్కాగా సెట్ చేసుకుని, సెట్స్ పైకి వెళదాం అని డిసైజ్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే ఇంత లేట్ అయ్యింది.
ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది టీమ్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొద్ది రోజులుగా జిమ్ లోనే గడుపుతున్నాడు. తారక్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిగతా విషయాలేవి బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









