ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ లో తారక్, త్రివిక్రమ్ మూవీ
- March 21, 2018
జైలవకుశ వచ్చి ఆరు నెలలవుతున్నా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమా కోసమే ఇన్నాళ్ళూ వెయిట్ చేశాడు తారక్. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నాడు. తన రీసెంట్ మూవీ జైలవకుశ వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇంత గ్యాప్ తీసుకున్న తారక్, ఏప్రిల్ 12నుంచి తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారికా అండ్ హాసిని సంస్థలో రూపొందే సినిమా...నిజానికి ఎప్పుడో లాంచనంగా ప్రారంభమైంది. కానీ అజ్ఞాతవాసి నిరాశపరచడంతో త్రివిక్రమ్, మరొకసారి స్టోరీని పక్కాగా సెట్ చేసుకుని, సెట్స్ పైకి వెళదాం అని డిసైజ్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే ఇంత లేట్ అయ్యింది.
ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది టీమ్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొద్ది రోజులుగా జిమ్ లోనే గడుపుతున్నాడు. తారక్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిగతా విషయాలేవి బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







