సౌదీ అరేబియా మీదుగా ఇజ్రాయెల్కు చేరిన..ఎయిరిండియా విమాన యాన సంస్థ
- March 23, 2018టెల్ అవివ్: సౌదీ అరేబియా గగనతలం మీదేగా ఇజ్రాయెల్కు వెళ్లి భారత విమానయాన సంస్థ ఎయిరిండియా చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం శుక్రవారం ఇజ్రాయెల్లోని టెల్ అవివ్కు చేరుకున్నట్లు ఇజ్రాయెల్ పర్యాటక మంత్రి యారివ్లెవిన్ తెలిపారు. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వెళ్లే విమానాలను వారి గగనతలం నుంచి వెళ్లేందుకు ఎయిరిండియాకు ఆ అనుమతి ఇవ్వడంతో నేరుగా సౌదీ మీదుగా ఢిల్లీ నుంచి టెల్ అవివ్లోని బెన్ గురియాన్ విమానాశ్రయానికి విమానం చేరుకుంది. 'ఇది నిజంగా చారిత్రక ఘటనని, తాము కొత్త తరంలో ఉన్నామని, మరింత మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్కు రావాలని, అలాగే ఇజ్రాయెల్ వాసులు భారత్కు అధిక సంఖ్యలో వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ పర్యాటక మంత్రి యారివ్ లెవిన్ వెల్లడించారు. ఈ మార్పు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఎయిరిండియాకు తమ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు బాగా తగ్గింది. దాదాపు రెండు గంటలు అదనపు ప్రయాణం తగ్గింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..