విమానంలో సీటు కింద 1.222 కేజీల బంగారం
- March 23, 2018
శంషాబాద్:విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.222 కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. సదరు బంగారం సామగ్రిలో కాకుండా విమానంలోని నిందితుడి సీటు కింద లభ్యమైంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు.విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్కు వచ్చాడు. ఎయిర్పోర్టు బయటకు వస్తున్న క్రమంలో సదరు ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాస్పోర్టును పరిశీలించారు. అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. విమానంలో సీటు కింద రహస్యంగా పెట్టిన 1.222కేజీల బంగారం బిస్కెట్లను మరోవ్యక్తి అదే విమానంలో అదే సీటును బుకింగ్ చేసుకొని దిల్లీ మీదుగా వైజాగ్కు తరలిస్తాడని వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







