రామ్ తో జోడీ కట్టనున్న రాశీఖన్నా

- May 05, 2015 , by Maagulf
రామ్ తో జోడీ కట్టనున్న రాశీఖన్నా

రామ్ హీరోగా 'శివం' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నేహాశర్మ చెల్లెలు అయిషాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ సరసన హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటించనున్నారు. ఈ అమ్మడు నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించి గోల్డెన్ లెగ్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం రామ్ నటించిన 'పండగ చేస్కో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల అయిన వెంటనే 'శివం' రూపొందనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com