ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుక
- March 25, 2018
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడి నిశ్చితార్థం శనివారం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఆకాశ్ అంబానీ(25) డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజీ బ్లూ ఫౌండేషన్లో శ్లోకా మెహతా డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడ్డారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ లవ్ ప్రపోజల్ను శ్లోకా అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









