క్యాన్సర్ వ్యాధి బారినపడి చివరి దశలో ఉన్న రోగులకు సేవలు అందిస్తున్న సంస్థలను ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈనెల 31న స్పర్శ్ నైట్ పేరుతో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ ను విజయవంతం చేయలని బాలు కోరారు. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడలో నూతనంగా నిర్మిస్తున్న స్పర్శ్ హోస్పిక్ ఆసుపత్రి నిర్మాణంకోసం వినియోగిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .