షార్జా:28 ఏళ్ళ యువకుడ్ని బలిగొన్న అతివేగం
- March 27, 2018
షార్జా:అతి వేగం 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడ్ని బలిగొంది. షార్జాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం మలిహా రోడ్డులో అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, అతి వేగంతో కారుని నడిపిన యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అతి వేగంతో కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో యువకుడు సీటు బెల్టుని కూడా ధరించలేదు. ఈ ప్రమాదంలో కారులో వున్న మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్బంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







