షార్జా:28 ఏళ్ళ యువకుడ్ని బలిగొన్న అతివేగం
- March 27, 2018
షార్జా:అతి వేగం 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడ్ని బలిగొంది. షార్జాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం మలిహా రోడ్డులో అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, అతి వేగంతో కారుని నడిపిన యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అతి వేగంతో కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో యువకుడు సీటు బెల్టుని కూడా ధరించలేదు. ఈ ప్రమాదంలో కారులో వున్న మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్బంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!









