షార్జా:28 ఏళ్ళ యువకుడ్ని బలిగొన్న అతివేగం
- March 27, 2018
షార్జా:అతి వేగం 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడ్ని బలిగొంది. షార్జాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం మలిహా రోడ్డులో అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, అతి వేగంతో కారుని నడిపిన యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అతి వేగంతో కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో యువకుడు సీటు బెల్టుని కూడా ధరించలేదు. ఈ ప్రమాదంలో కారులో వున్న మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్బంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









