చర్చి గోయెర్స్కి దుబాయ్ పోలీసుల సూచన
- March 27, 2018
దుబాయ్ - సెంట్ మేరీస్ కేథలిక్ చర్చ్, ఈస్టర్ సందర్భంగా చర్చికి వచ్చేవారికి ఓ సూచన చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, తమతోపాటు పెద్ద సైజులో వుండే బ్యాక్ ప్యాక్స్ని తీసుకురావొద్దని సూచించింది. బ్యాగ్లను పరీక్షించడం జరుగుతుందనీ, అనుమానిత వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు నిర్వాహకులు. దుబాయ్ పోలీసుల సూచన మేరకే ఈ చర్యలు చేపట్టామని వారంటున్నారు. అయితే ఇది రొటీన్గా జరిగే వ్యవహారమేననీ, భద్రతా పరమైన ఆంక్షలు తప్పనిసరని వారు వివరించారు. పెద్ద సంఖ్యలో జనం పోగయ్యేటప్పుడు అనుకోని ఘటనలు చోటు చేసుకోవచ్చు కాబట్టి, ముందస్తు జాగ్రత్త అవసరమని కేథలిక్ చర్చి ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









