తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం
- March 31, 2018ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలను అకాలవర్షాలు కుదిపేశాయి. విశాఖ జిల్లాలోని చోడవరం, పాడేరు, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జి.మాడుగులలో పిడుగు పడడంతో చెట్టు కాలిపోయింది. పశువులు మృతి చెందాయి. చిత్తూరు, విజయనగరం, జిల్లాల్లోనూ ఓ మోస్తరు వాన పడింది. పిడుగులు పడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. చిత్తూరు జిల్లాలోని ఐరాల, తిరుపతి రూరల్, సోమల, చంద్రగిరి ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాచిపెంట, మెంటాడ ప్రాంతంలోనూ అప్రమత్తతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితర ద్రోణి ఆవరించి ఉన్న నేపథ్యంలో.. మరో రెండ్రోజులు ఉత్తర కోస్తా, సీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారురు చెప్తున్నారు.
అకాల వర్షాలు తెలంగాణను కూడా వణికించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పశువుల పాకలు, పాత ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. సిద్ధిపేటలో వడగళ్ల వాన కురిసింది. ఈ బీభత్సానికి వందల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. ఒక్కసారిగా వడగళ్లు పడడంతో రైతులు వణికిపోయారు. పిందెలు రాలిపోవడంతో మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. వేములవాడ పట్టణంలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయం ముందంతా నీళ్లు నిలిచిపోయాయి. బోయినిపల్లి, చందుర్తి మండలాల్లో కూడా వడగళ్లు పడ్డాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?