ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

- April 03, 2018 , by Maagulf
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకే పగ్గాలు అప్పగిస్తున్నారు. రెండుమూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిపై కసరత్తు చేస్తున్న అధిష్టానం.. చివరికి దీనిపై నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచి రేసులో మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరే వినిపించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో సోముకు లైన్ క్లియరయ్యింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగిన రాంమాధవ్.. సామాజిక సమీకరణాల్ని లెక్కలేకి తీసుకుని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ముఖ్యనేతలు అందరితోనూ ఈ విషయంపై ఇప్పటికే అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అధిష్టానం చివరికి వీర్రాజు పేరే ఫైనల్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com