ఫేక్‌ బాంబ్‌: నిందితుడికి మూడేళ్ళ జైలు

- April 03, 2018 , by Maagulf
ఫేక్‌ బాంబ్‌: నిందితుడికి మూడేళ్ళ జైలు

ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశ్యంతో ఫేక్‌ బాంబ్‌ని తయారుచేసి, దాన్ని ఓ పబ్లిక్‌ ప్లేస్‌లో పెట్టినందుకుగాను నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది ఫోర్త్‌ హై క్రిమినల్‌ కోర్ట్‌. 2015లో ఈ ఘటన జరిగింది. నల్లటి బ్యాగ్‌లో, ఓ ప్లాస్టిక్‌ కంటెయినర్‌ని వుంచి, దాన్ని బాంబులా తీర్చిదిద్ది, అదనంగా ఎలక్ట్రానిక్‌ వైర్లు తగిలించి తుబ్లిలోని ఓ బ్యాకరీలో డిసెంబర్‌ 5, 2015న నిందితుడు ఆ బ్యాగ్‌ని వుంచాడు. దాన్ని బాంబుగా భావించి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ బ్యాగ్‌ని తమతో తీసుకెళ్ళి, పరీక్షలు నిర్వహించి అది ఫేక్‌ అని తేల్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి 18 ఏళ్ళ వయసు కావడంతో, కేవలం మూడేళ్ళ శిక్షతో సరిపెడ్తున్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com