రామ్మనోహర్ లోహియా పురస్కారం అందుకోనున్న హోంమంత్రి నాయిని
- April 03, 2018
హైదరాబాద్: డాక్టర్ రామ్మనోహర్ లోహియా జీవితసాఫల్య పురస్కారాన్ని నేడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ప్రదానం చేయనున్నారు. రవీంద్రభారతిలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని హోంమంత్రికి అవార్డును అందజేస్తారు. రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా లోహియా విచార్మంచ్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుభాషణ్రెడ్డి, ప్రముఖ రచయిత కత్తి పద్మారావు, లోహియా జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాలకిషన్రావు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నారని, టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని రాంనగర్ కార్పొరేటర్ వీ శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..