'మహానటి' లో అచ్చంగా తానే వినిపించనున్న సమంత

- April 04, 2018 , by Maagulf
'మహానటి' లో అచ్చంగా తానే వినిపించనున్న సమంత

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా సమంత విలేకరిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పనుంది. ఇప్పటివరకూ సమంతకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గాత్రం అందించేది. ఇటీవల చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాలో మోహన్‌బాబు, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com