కామన్వెల్త్ గేమ్స్‌: నాలుగో స్థానంలో భారత్

- April 07, 2018 , by Maagulf
కామన్వెల్త్ గేమ్స్‌: నాలుగో స్థానంలో భారత్

కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా కొనసాగుతుండటంతో పథకాల పట్టికలో భారత్‌ ఇప్పటివరకు టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో రోజు ముగిసే సరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 56 కేజీల విభాగంలో పి.గురురాజ రజత పతకం, 69 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం సాధించాడు. భారత వెయిట్‌ లిఫ్టర్లు సతీశ్ శివలింగం, వెంకట్ రాహుల్ భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు సాధించి పెట్టారు. మిజోరంకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను 53వ కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఇక మిరాబాయ్ చాను కూడా స్వర్ణం సాధించడంతో భారత్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.

అయితే ఇక్కడ భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలు వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 57పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 32 పతకాలతో రెండో స్థానంలో ఇంగ్లండ్, 18 పతకాలతో కెనడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక భారత్ ఆరు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com