రన్వే మూసివేత.. 225 విమానాలు రద్దు
- April 09, 2018
ముంబయి: రుతుపవనాల ముందు చేపట్టే నిర్వహణ పనుల కారణంగా ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన రన్వేను 6 గంటల పాటు మూసివేయడంతో సోమవారం 225కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 70 విమానాల వేళలు మార్చారు. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా , ఇండిగో, స్పైస్జెట్, గో ఎయర్, విస్టారా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంఐఏఎల్) నిర్వహిస్తున్న ఈ రన్వేను సోమ, మంగళవారాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా జెట్ ఎయిర్వేస్ 54 దేశీయ సర్వీసులు సహా మొత్తం 70 విమానాలను రద్దు చేసింది. మరో 70 విమానాల వేళల్లో మార్పులు చేసింది. ఎయిర్ ఇండియా 34 విమానాలను నడపరాదని ముందే నిర్ణయించింది. ఈమేరకు ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం కూడా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయమైన ఇక్కడ 09/27 (ప్రధాన), 14/32 (రెండో) రన్వేలున్నాయి. ఇందులో ప్రధాన రన్వేపై గంటకు 48 విమానాల రాకపోకలకు వీలుండగా.. రెండోది 35 విమానాల రాకపోకల సామర్ధ్యంతో ఉంది. ప్రతిరోజూ ఈ విమానాశ్రయానికి సగటున 970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







