రన్వే మూసివేత.. 225 విమానాలు రద్దు
- April 09, 2018
ముంబయి: రుతుపవనాల ముందు చేపట్టే నిర్వహణ పనుల కారణంగా ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన రన్వేను 6 గంటల పాటు మూసివేయడంతో సోమవారం 225కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 70 విమానాల వేళలు మార్చారు. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా , ఇండిగో, స్పైస్జెట్, గో ఎయర్, విస్టారా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంఐఏఎల్) నిర్వహిస్తున్న ఈ రన్వేను సోమ, మంగళవారాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా జెట్ ఎయిర్వేస్ 54 దేశీయ సర్వీసులు సహా మొత్తం 70 విమానాలను రద్దు చేసింది. మరో 70 విమానాల వేళల్లో మార్పులు చేసింది. ఎయిర్ ఇండియా 34 విమానాలను నడపరాదని ముందే నిర్ణయించింది. ఈమేరకు ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం కూడా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయమైన ఇక్కడ 09/27 (ప్రధాన), 14/32 (రెండో) రన్వేలున్నాయి. ఇందులో ప్రధాన రన్వేపై గంటకు 48 విమానాల రాకపోకలకు వీలుండగా.. రెండోది 35 విమానాల రాకపోకల సామర్ధ్యంతో ఉంది. ప్రతిరోజూ ఈ విమానాశ్రయానికి సగటున 970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









