రన్వే మూసివేత.. 225 విమానాలు రద్దు
- April 09, 2018
ముంబయి: రుతుపవనాల ముందు చేపట్టే నిర్వహణ పనుల కారణంగా ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన రన్వేను 6 గంటల పాటు మూసివేయడంతో సోమవారం 225కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 70 విమానాల వేళలు మార్చారు. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా , ఇండిగో, స్పైస్జెట్, గో ఎయర్, విస్టారా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంఐఏఎల్) నిర్వహిస్తున్న ఈ రన్వేను సోమ, మంగళవారాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా జెట్ ఎయిర్వేస్ 54 దేశీయ సర్వీసులు సహా మొత్తం 70 విమానాలను రద్దు చేసింది. మరో 70 విమానాల వేళల్లో మార్పులు చేసింది. ఎయిర్ ఇండియా 34 విమానాలను నడపరాదని ముందే నిర్ణయించింది. ఈమేరకు ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం కూడా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయమైన ఇక్కడ 09/27 (ప్రధాన), 14/32 (రెండో) రన్వేలున్నాయి. ఇందులో ప్రధాన రన్వేపై గంటకు 48 విమానాల రాకపోకలకు వీలుండగా.. రెండోది 35 విమానాల రాకపోకల సామర్ధ్యంతో ఉంది. ప్రతిరోజూ ఈ విమానాశ్రయానికి సగటున 970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







