గోల్డ్ మెడల్ సాధించిన హీనా.. బాక్సింగ్లో మరో ఇద్దరు సెమీస్కు
- April 10, 2018
కామన్ వెల్త్లో మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత షూటర్ హీనా సిద్ధు స్వర్ణాన్ని సాధించింది. మొత్తం 38 పాయింట్లు సాధించిన హీనా.. కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సిల్వర్ సాధించిన సిద్ధూ.. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మరింత మెరుగ్గా రాణించి బంగారు పతకాన్ని దక్కించుకోవడం విశేషం. మరో భారత అమ్మాయి అనుసింగ్ ఆరోస్థానంలో నిలిచింది. హీనా సాధించిన గోల్డ్ మెడల్తో.. భారత్ పతకాల సంఖ్య 20కి చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరుగుతున్న ఈ కామన్ వెల్త్ గేమ్స్లో ఇంతవరకూ 11 స్వర్ణాలు.. 4 రజతాలు.. 5 కాంస్యాలు మనకు దక్కాయి.
అటు బాక్సింగ్లోనూ భారత క్రీడాకారులు సెమీస్కు చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు. 46 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్.. స్కాట్లాండ్ ప్లేయర్పై విజయం సాధించగా.. 91 కేజీల విభాగంలో నమన్ తన్వర్.. సమోవాకు చెందిన బాక్సర్ను ఓడించి సెమీస్కు దూసుకెళ్లారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!