శ్రీరెడ్డి వెళుతున్న విధానం కరెక్ట్ కాదు: కంగనా
- April 10, 2018
శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనతో టాలీవుడ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చించుకునే అంశంగా మారింది. కాస్టించ్ కౌచ్, తెలుగు హీరోయిన్లకు సరైన గుర్తింపు అంటూ శ్రీరెడ్డి చేస్తున్న నిరసనకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. శ్రీరెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన నిరసనను సాధ్యమైనంతగా చేస్తూనే ఉంది. అయితే శ్రీరెడ్డి చేస్తున్న ఈ విధానం తప్పంటుంది బాలీవుడ్ భామ కంగనా రౌనత్. తాజాగా శ్రీరెడ్డి తీరుపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
టాలీవుడ్లోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారని, సినీ ఇండస్ట్రీలలో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తాను కూడా అలాంటి ఇబ్బందులు పడ్డానని కంగనా చెప్పింది. అయితే ఇలాంటి విషయాలపై పోరాడటానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పిన కంగనా, శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని, సరైన మార్గం ఎంచుకోవాలని శ్రీరెడ్డికి కంగనా సూచనలిచ్చింది.
బట్టలు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేయడం ద్వారా నిరసన తెలియజేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యల వల్ల ఇండస్ట్రీలో సున్నిత మనస్కులైన కొందరు వ్యక్తులు ఇబ్బందిపడతారని కంగనా తెలిపింది. ఇలా చేయడం వల్ల ఆమెకు మద్దతు తెలపాలని అనుకునే కొందరు కూడా.. ఆమె పద్ధతి నచ్చక ముందుకు రారని తెలిపింది. జరిగిన అన్యాయంని చూపిస్తూ.. పోరాడుతున్న సమస్యకు ప్రచారం కలిగేలా చూసుకోవాలని ఆమెకు సలహా ఇస్తూ.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై పోరాటానికి మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







