గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్య
- April 11, 2018
ఇస్లామాబాద్ : గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్యకు గురైంది. ఈ సంఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని లార్కానా జిల్లా కంగా గ్రామంలో జరిగింది. వేదికపై పాడుతున్నప్పుడు ఓ వ్యక్తి తను చెప్పినట్లు చేయకపోవడంతో కోపంతో తన వద్ద నున్న గన్తో కాల్చి చంపాడు. ఈ సంఘటనతో అక్కడి వారందరూ ఉలిక్కిపడ్డారు. మృతురాలు సమీనా సామూన్ అలియాస్ సమీనా సింధు(24) ఆరు నెలల గర్భవతి అని ఆమె భర్త తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నిందితుడు తారిఖ్ అహ్మెద్ జాతోయ్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తారిఖ్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







