గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్య
- April 11, 2018
ఇస్లామాబాద్ : గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్యకు గురైంది. ఈ సంఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని లార్కానా జిల్లా కంగా గ్రామంలో జరిగింది. వేదికపై పాడుతున్నప్పుడు ఓ వ్యక్తి తను చెప్పినట్లు చేయకపోవడంతో కోపంతో తన వద్ద నున్న గన్తో కాల్చి చంపాడు. ఈ సంఘటనతో అక్కడి వారందరూ ఉలిక్కిపడ్డారు. మృతురాలు సమీనా సామూన్ అలియాస్ సమీనా సింధు(24) ఆరు నెలల గర్భవతి అని ఆమె భర్త తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నిందితుడు తారిఖ్ అహ్మెద్ జాతోయ్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తారిఖ్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









