దుబాయ్: ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష

- April 12, 2018 , by Maagulf
దుబాయ్: ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష

యూఏఈలో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష పడింది. 200 మిలియన్‌ డాలర్ల చీటింగ్‌ కేసులో ఈ శిక్ష విధిస్తూ దుబాయి స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, మరియు రేయాన్ డీసౌజాలకి న్యాయమూర్తి 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. వీరు ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారంటూ దుబాయి న్యాయస్థానం నిర్ధారించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com