మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి

- April 13, 2018 , by Maagulf
మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే సంచలన ప్రకటనలు చేసిన శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆరోపించింది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావు లక్ష్యంగానే శ్రీరెడ్డి ఈ కామెంట్లు చేసింది.

వాకాడ అప్పారావు వందలాది మంది మహిళా ఆర్టిస్టులను వేధించారని, 16 ఏళ్ల పిల్లలను కూడా వదిలి పెట్టలేదని ట్వీట్ చేసింది. చిరంజీవి పేరు చెప్పుకుని నీచమైన పనులు చేసే ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది. ట్వీట్‌కు వాకాడ అప్పారావు ఫొటోను సైతం శ్రీరెడ్డి జత చేయడం విశేషం. ఇప్పుడిది సంచలనంగా మారింది. అటు, రాంగోపాల్ వర్మ పట్ల శ్రీరెడ్డి పొగడ్తల వర్షం కురిపించింది. కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న తనకు ఇంతలా సపోర్ట్ ఇచ్చారంటే అది వర్మ ఒక్కరేనని ట్వీట్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com