ఎయిర్పోర్టులో భారత్కు భంగపాటు
- April 17, 2018ఇస్తాన్బుల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటణలు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి. టర్కీ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఇస్తాన్బుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు ‘ఇండియాలో ఆవులకు ఉన్న విలువ అక్కడి మనుషులకు, ముఖ్యంగా మహిళలకు లేదు’ అంటూ టీషర్ట్లపై కొటేషన్లను ముద్రించి వాటిని ధరించి ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొంతమంది ‘మీ ఆడవారిని ఇండియాకు పంపించాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆలోచించండి’ అంటూ టీషర్ట్లపై ముద్రించు కున్నారు.
దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. అంతర్జాతీయంగా భారత్ పరువు పోవడానికి కారణమైన ఆ అత్యాచార నిందితులను వెంటనే ఉరి తీయాలని కొంతమంది నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారంటూ టీషర్ట్ ధరించిన వారిపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మహిళలపై లైంగిక దాడులను అరికట్టనంత వరకు ఇలాంటి అవమానాలను ఎదుర్కొనక తప్పదు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము