మధ్యప్రదేశ్:ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
- April 18, 2018మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ వేడుక ముగించుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వస్తున్నారు. ఈక్రమంలో వారి వాహనం జోగ్దాహా బ్రిడ్జిపై వెళుతోంది. వేగంగా వెళుతున్న వాహనం బ్రిడ్జి గోడకి గుద్దుకోవడంతో సోన్ నదికి సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న ట్రక్కు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయంతో గాలించగా స్పాట్లోనే 15 మంది మృతి చెందినట్లు, మరో 7గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల సహాయాన్ని ప్రకటించినట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్