29 మంది మహిళా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డిపోర్టేషన్
- April 19, 2018
మస్కట్: మొత్తం 29 మంది మహిళా ఇమ్మిగ్రెంట్స్ని (ఇల్లీగల్) డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్ట్ చేసినట్లు ఆర్ఓపి వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ ఆఫ్రికా జాతీయులని, జ్యుడీషియల్ నిర్ణయం మేరకు వీరిని డిపోర్ట్ చేశామని ఆర్ఓపి వివరించింది. వివిధ దేశాలతో వున్న ఒప్పందాల మేరకు ఆయా దేశాల ఎంబసీలతో చర్చించి, ఇలాంటి విషయాల్లో తగు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి వారు బయటకు వెళ్ళేంతవరకు తగిన వైద్య సహాయం చేస్తున్నామనీ, వారి భద్రతకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, హ్యూమన్ రైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







