29 మంది మహిళా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డిపోర్టేషన్
- April 19, 2018
మస్కట్: మొత్తం 29 మంది మహిళా ఇమ్మిగ్రెంట్స్ని (ఇల్లీగల్) డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్ట్ చేసినట్లు ఆర్ఓపి వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ ఆఫ్రికా జాతీయులని, జ్యుడీషియల్ నిర్ణయం మేరకు వీరిని డిపోర్ట్ చేశామని ఆర్ఓపి వివరించింది. వివిధ దేశాలతో వున్న ఒప్పందాల మేరకు ఆయా దేశాల ఎంబసీలతో చర్చించి, ఇలాంటి విషయాల్లో తగు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి వారు బయటకు వెళ్ళేంతవరకు తగిన వైద్య సహాయం చేస్తున్నామనీ, వారి భద్రతకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, హ్యూమన్ రైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









