ఇండియా: రైల్వే టికెట్ ఆన్లైన్ బుకింగ్లో సమస్యలు రాకుండా..
- April 19, 2018ఆన్లైన్ వచ్చాక గంటలు గంటలు క్యూల్లో నిల్చోవాల్సిన పనిలేదు. ఆఫీసు నుంచే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. రైల్వే టికెట్లకు సంబంధించి కొన్ని ఆన్లైన్ నిబంధనలు పాటిస్తే టికెట్ బుకింగ్ సులభమవుతుంది. దీని కోసం ఐఆర్సీటీసి వెబ్ సైట్లోకి లాగిన్ చేసిన తరువాత స్క్రీన్ మీద చూపించిన ఆప్షన్లను వెంట వెంటనే క్లిక్ చేయాలి. లేకపోతే మళ్లీ లాగిన్ కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా బుకింగ్లో ఏవిధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..
* ఒక నెలలో ఒక ఐడీ మీద 6 టికెట్లు మాత్రమే బుక్ చేయాలి.
* ఐడీకి ఆధార వెరిఫికేషన్ పూర్తయివుంటే 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ఉదయం 8నుంచి 10 గంటల లోపు అయితే రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.
* ప్యాసింజర్ డిటైల్స్ పేజీలో కేవలం 25 సెకన్లలోనే వివరాలు నమోదు చేయాలి.
* పేమెంట్ చేసేందుకు కూడా 10 సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది.
* పేమెంట్ చెల్లింపు కోసం కార్డుల వినియోగంలో ఓటీపీ తప్పనిసరిగా జత చేయాలి.
ఇక తత్కాల్ టికెట్ల నిబంధనలు పరిశీలిస్తే..
* ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒకే యూజర్ ఐడీ మీద కేవలం రెండు టికెట్లు (అంటే రిటర్న్ జర్నీతో కలిపి) మాత్రమే బుకే చేసే వీలుంది.
* ఒక ఐపీ అడ్రస్ మీద కేవలం రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..