అగ్నిమాపక రంగంలో మహిళ..ఎఎఐలో భాద్యతలు చేపట్టనున్న తానియా
- April 22, 2018కోల్కతా : అగ్నిమాపక రంగంలో కోల్కతా యువతి తానియా సన్యాల్ రావడంతోపాటు మొట్టమొదటి అగ్నిమాపక మహిళా సిబ్బందిగా రికార్డు స అష్టించనున్నారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)లో 3,310 మంది పురుషులు ఫైర్ఫైటర్లుగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా నియమించలేదు. తాజాగా ఎఎఐ తానియా సన్యాల్ను ఫైర్ఫైటర్గా నియమించింది. ఆమెకు ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్లో శిక్షణ ఇస్తోంది. మరో నెలలో ఆమె ఫైర్ఫైటర్గా పూర్తి స్థాయిలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎఎఐ చైర్మన్ గురుప్రసాద్ మాట్లాడుతూ విమానాశ్రయాల విస్తరణ, నూతన విమానాశ్రయాల నిర్మాణం వల్ల ఫైర్ఫైటర్ల కొరత ఏర్పడిందన్నారు. అందుకే ఈ రంగంలోకి మహిళలను తీసుకురావాలని నిర్ణయించామన్నారు. పురుషుల కనీస బరువు 50 కేజీలు ఉండాలనే నిబంధన ఉందని, అయితే మహిళా అభ్యర్థుల కనీస బరువు 40 కేజీలకు తగ్గించేలా నిబంధనలలో మార్పు చేశామన్నారు. తాను ఫైర్ఫైటర్నవడం గర్వకారణమని, తనకు ఎంతో గౌరవం దక్కిందని తానియా తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించే ఉద్యోగ బాధ్యతలు అత్యంత సమున్నతమైనవని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు