చైనా-భారత్ సంబంధాల్లో కొత్త శకం
- April 22, 2018న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో మాట్లాడిన సుష్మా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై జిన్పింగ్తో మోదీ ఈ నెల 27, 28న అనధికారికంగా వుహన్ నగరంలో సమావేశం అవుతారని చెప్పారు.
ఈ కీలక భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ అనంతరం భారత్-చైనా సంబంధాల్లో గొప్ప ముందడుగు పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కింలోని నాథులా పాస్ గుండా మానస సరోవర యాత్రను తర్వలో పునఃప్రారంభించనున్నట్లు కూడా సుష్మా తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?