న్యూస్ ఛానెల్స్ ను దెబ్బ తీసిన చంద్రబాబు ధర్మ దీక్ష..!
- April 26, 2018ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం తన పుట్టిన రోజు నాడే ధర్మదీక్ష పేరుతో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రే దీక్ష చేపట్టడంతో, కవర్ చేయడం తప్ప మీడియా ఛానెల్స్ కు వేరే దారి లేకపోయింది. ఉదయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ మొదట ధర్మదీక్ష ఏర్పాట్లు, ఆ తర్వాత ధర్మదీక్ష, అనంతరం బాబు ప్రసంగం, ఇలా మొత్తమ్మీద కలిపి ఆంధ్రాన్యూస్ ఛానెల్స్ ఆరోజు 15 గంటలు చంద్రబాబుకు దాసోహమయ్యాయి.
కొందర్ని భయపెట్టి, ఇంకొందరికి ఐదు నుంచి పది వరకూ లక్షల రూపాయలు ఇచ్చుకుని, ధర్మదీక్షను న్యూస్ ఛానెల్స్ తో రోజంతా హడావిడి చేయించి జాతీయ అంశంగా చేయాలనుకున్నారు చంద్రబాబు అండ్ పార్టీ. అయితే అది సరిగ్గా ఫలించినట్టు లేదు. బాబు ధర్మదీక్ష చేసిన ఆ ఒక్కరోజున, తెలుగు న్యూస్ ఛానెల్స్ కు రెగులర్ గా వచ్చే రేటింగుల కంటే దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. టీఆర్పీ మొత్తం భయంకరంగా డౌన్ అయిపోవడం గమనార్హం. తెలుగులో ఏ న్యూస్ ఛానెల్ కు రేటింగ్ రాలేదు. రెగులర్ గా వచ్చే రేటింగ్ కన్నా ఆరోజు తక్కువ రేటింగులు నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..