శ్రీలంకలో రెండు రోజులు మద్యం, మాంసం నిషేధం...
- April 27, 2018
తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే వెషాక్ ఫెస్టివల్ ఏప్రిల్ 29వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు రోజులపాటు సూపర్ మార్కెట్లు, హోటళ్లలో మాంసం, మద్యంను విక్రయించరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బుద్ధ పూర్ణిమ సమయంలో శ్రీలంకలో బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తారు. అయితే తొలిసారిగా మాంసం విక్రయంపై కూడా ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం.
అహింస అనేది బుద్ధుని సిద్ధాంతం కాబట్టి.. ఆయన జయంతి రోజున మాంస విక్రయాలు చేయడం కూడా అనైతికమని భావించిన శ్రీలంక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మాంసం దుకాణాలతో పాటు సూపర్ మార్కెట్లలో లభించే ప్యాకేజ్డ్ మీట్ విక్రయాలపై కూడ ఈ రెండు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కొత్త పద్ధతిని పాటించనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









