ఏపీలో కొత్త కొలువులు: 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు
- April 28, 2018అమరావతి:నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా 10,351 పోస్టులకు నోటిపికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని , జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్లైన్లో డీఎస్సీని నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- జద్దాఫ్లోని షేక్ జాయెద్ రోడ్లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి?
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ పౌరులకు సహాయం..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!
- ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- 160 దేశాల కార్మికుల కోసం 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్..సౌదీ అరేబియా
- దావోస్ లో పెట్టుబడుల వేట ప్రారంభించిన సీఎం రేవంత్
- ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్
- జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు