ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్
- April 29, 2018
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థతోనే భారత్కు మనుగడ అన్నారు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. చాలా అంశాలపై స్టాలిన్తో చర్చించామన్నారు. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా.. దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు మౌలిక వసతులు కల్పించలేకపోయాయని, రాష్ట్రాలకు మరింతగా అధికారాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మే 10న తెలంగాణకు రావాలని స్టాలిన్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఫ్రంట్ విషయమై మరో రెండు మూడు నెలల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







