ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్

- April 29, 2018 , by Maagulf
ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్

దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థతోనే భారత్‌కు మనుగడ అన్నారు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. చాలా అంశాలపై స్టాలిన్‌తో చర్చించామన్నారు. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా.. దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు మౌలిక వసతులు కల్పించలేకపోయాయని, రాష్ట్రాలకు మరింతగా అధికారాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మే 10న తెలంగాణకు రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. 

ఫ్రంట్ విషయమై మరో రెండు మూడు నెలల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com