యూఏఈలో ఇలా చేస్తే 1 మిలియన్ దిర్హామ్ల జరీమానా
- May 01, 2018దుబాయ్: ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో అప్రమత్తంగా వుండాలి. ఫాల్స్ న్యూస్ని పోస్ట్ చేసినా, షేర్ చేసినా భారీగా జరీమానాలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ జరీమానా 1 మిలియన్ దిర్హామ్ వరకు వుంటుంది. టెలికమ్యూనికేషన్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రూమర్స్ కావొచ్చు, తప్పుడు వార్తలు కావొచ్చు, విద్వేషపూరితమైన విషయాలు కావొచ్చు, మీ దృష్టికి వస్తే, వాటి జోలికి వెళ్ళొదు. వీలుంటే, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేగానీ, వాటిని తిరిగి ఎవరికైనా పంపితే మాత్రం చిక్కులు ఎదురవుతాయి. టిఆర్ఏ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పెట్టింది. యూఏఈ యాంటీ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం ఉల్లంఘనులకు 1 మిలియన్ దిర్హామ్ల వరకు జరీమానా పడుతుందని టిఆర్ఏ పేర్కొంది. షేర్ చేసిన మెసేజ్ని బట్టి ఉల్లంఘనను నిర్ధారించి జరీమానా శిక్ష విధించడం జరుగుతుంది. అత్యధిక జరీమానా 1 మిలియన్ దిర్మామ్లు. సో, బీ కేర్ ఫుల్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?