30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం
- May 05, 2018
ఫ్రిజ్లో వాటర్ తాగితే పళ్లు జివ్వు మంటాయి. మండే ఎండల్లో అయితే కాస్త పర్లేదు కానీ వణికించే చలిలో కూడా ఐస్ వాటర్ తాగాలంటే చాలా కష్టం. మరి అలాంటిది గుజరాత్ అమ్రెలీనివాసి కాంతీలాల్కు గత 30 ఏళ్లనుంచి ఐసు ముక్కలు తినే అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 ఐస్ గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. కార్పెంటర్గా పని చేస్తున్న ఇతడికి ఐస్ తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఇంట్లో రెండు ప్రిజ్లు పెట్టుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఐస్ని ఆబగా ఆరగించేస్తుంటాడు. ఇదేం రోగమో అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. రక్తంలో సంభవించే మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు నిర్ధారించారు. కాంతీ భాయ్ తన మకాంని కాశ్మీర్కి మార్చాలనుకుంటున్నాడట. అక్కడైతే మంచుకి కొరత ఉండదని ఏకంగా కొండలే ఉంటాయి ఎంత తిన్నా అడిగే వారు ఉండరనుకుంటున్నాడేమో.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







