30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం
- May 05, 2018
ఫ్రిజ్లో వాటర్ తాగితే పళ్లు జివ్వు మంటాయి. మండే ఎండల్లో అయితే కాస్త పర్లేదు కానీ వణికించే చలిలో కూడా ఐస్ వాటర్ తాగాలంటే చాలా కష్టం. మరి అలాంటిది గుజరాత్ అమ్రెలీనివాసి కాంతీలాల్కు గత 30 ఏళ్లనుంచి ఐసు ముక్కలు తినే అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 ఐస్ గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. కార్పెంటర్గా పని చేస్తున్న ఇతడికి ఐస్ తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఇంట్లో రెండు ప్రిజ్లు పెట్టుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఐస్ని ఆబగా ఆరగించేస్తుంటాడు. ఇదేం రోగమో అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. రక్తంలో సంభవించే మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు నిర్ధారించారు. కాంతీ భాయ్ తన మకాంని కాశ్మీర్కి మార్చాలనుకుంటున్నాడట. అక్కడైతే మంచుకి కొరత ఉండదని ఏకంగా కొండలే ఉంటాయి ఎంత తిన్నా అడిగే వారు ఉండరనుకుంటున్నాడేమో.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







