30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం
- May 05, 2018
ఫ్రిజ్లో వాటర్ తాగితే పళ్లు జివ్వు మంటాయి. మండే ఎండల్లో అయితే కాస్త పర్లేదు కానీ వణికించే చలిలో కూడా ఐస్ వాటర్ తాగాలంటే చాలా కష్టం. మరి అలాంటిది గుజరాత్ అమ్రెలీనివాసి కాంతీలాల్కు గత 30 ఏళ్లనుంచి ఐసు ముక్కలు తినే అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 ఐస్ గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. కార్పెంటర్గా పని చేస్తున్న ఇతడికి ఐస్ తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఇంట్లో రెండు ప్రిజ్లు పెట్టుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఐస్ని ఆబగా ఆరగించేస్తుంటాడు. ఇదేం రోగమో అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. రక్తంలో సంభవించే మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు నిర్ధారించారు. కాంతీ భాయ్ తన మకాంని కాశ్మీర్కి మార్చాలనుకుంటున్నాడట. అక్కడైతే మంచుకి కొరత ఉండదని ఏకంగా కొండలే ఉంటాయి ఎంత తిన్నా అడిగే వారు ఉండరనుకుంటున్నాడేమో.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









