ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నఆటగాడికి మరో అరుదైన అవకాశం
- May 07, 2018యువ క్రికెటర్ శ్రేయస్ మరో జాక్పాట్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని ఆఫ్ఘనిస్తాన్తో తలపడడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కి కోహ్లీ స్థానంలో శ్రేయస్ని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకున్నట్లే. కోహ్లీ జూన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. కౌంటీలో ఆరు మ్యాచ్లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులైలో భారత జట్టు ఇంగ్లండులో పర్యటించనున్నందున కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఆఫ్ఘాన్తో జరిగే మ్యాచ్కు కోహ్లీ దూరమవుతున్నాడు. దీంతో శ్రేయస్ పేరు తెరపైకి వచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!