ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నఆటగాడికి మరో అరుదైన అవకాశం
- May 07, 2018యువ క్రికెటర్ శ్రేయస్ మరో జాక్పాట్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని ఆఫ్ఘనిస్తాన్తో తలపడడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కి కోహ్లీ స్థానంలో శ్రేయస్ని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకున్నట్లే. కోహ్లీ జూన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. కౌంటీలో ఆరు మ్యాచ్లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులైలో భారత జట్టు ఇంగ్లండులో పర్యటించనున్నందున కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఆఫ్ఘాన్తో జరిగే మ్యాచ్కు కోహ్లీ దూరమవుతున్నాడు. దీంతో శ్రేయస్ పేరు తెరపైకి వచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు