మలేసియా:92 ఏళ్ల వయస్సులో మళ్లీ ప్రధాని అవుతున్నారు
- May 09, 2018మలేసియా సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని మహతిర్ మొహమద్ చారిత్రక విజయం సాధించారు.
దేశంలో గత 60 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న బారిసన్ నేషనల్ కూటమి ప్రభుత్వాన్ని 92 ఏళ్ల మహతిర్ ఓడించారు.
రాజకీయాల నుంచి రిటైర్ అయిన మహతిర్.. తన మాజీ సహచరుడు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నజీబ్ రజాక్పై పోటీ చేసేందుకు మళ్లీ బరిలో దిగారు. నజీబ్కు రాజకీయ గురువు మహతిర్.
''మేం ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం లేదు. న్యాయాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం'' అని మహతిర్ విలేకరులతో అన్నారు.
మొత్తం 222 పార్లమెంటు సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు అవసరం కాగా.. మహతిర్ నాయకత్వంలోని పకటన్ హరపన్ కూటమి 115 సీట్లలో విజయం సాధించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని బీఎన్ కూటమికి 79 సీట్లు దక్కాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..