హైదరాబాద్:ప్రముఖ నటుడి వస్త్ర దుకాణంలో చోరీ
- May 19, 2018
సినీ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ముగ్గురు మహిళలు దృష్టి మరల్చి ఖరీదైన మూడు చీరలను తీసుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు ఉత్తేజ్కు ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో వస్ర్తాల దుకాణం ఉంది. దీన్ని ఆయన సతీమణి పద్మావతి నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చారు. చీరలను చూస్తునట్టు నటించి, పద్మావతి దృష్టి మరల్చి మూడు చీరలను తీసుకొని పారిపోయారు. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని ఉత్తేజ్ సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







