యు.ఏ.ఈ:వాట్సాప్ వాయిస్ నోట్పై హెచ్చరిక
- May 25, 2018యు.ఏ.ఈ:వాట్సాప్ వంటి యాప్ల ద్వారా టెక్స్ మెసేజ్లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా వీరు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వాట్సాప్లో వాయిస్ నోట్ ద్వారా అమాయకుల్ని మోసం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. 200,000 దిర్హామ్లు గెల్చుకున్నారంటూ యూఏఈలోని ప్రముఖ హైపర్ మార్కెట్ ఛెయిన్ పేరుతో వాయిస్ నోట్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ పేరుతో ఈ దుష్ప్రచారం జరుగుతోంది. అయితే లులు సంస్థ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. లులు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోదని ఆ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. తమ సంస్థ నుంచి ఎవరూ ఫోన్ చేయడంగానీ, టెక్స్ట్ మెసేజ్లు చేయడంగానీ, వాయిస్ నోట్స్ పంపడంగానీ జరగదనీ, అలా ఎవరైనా ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ డిటెయిల్స్ అడిగితే తమకు సంబంధం లేదని లులు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?