షియామీ బంపర్ ఆఫర్.. ఫోన్ ఉంటే లక్షరూపాయల లోన్
- May 28, 2018
చైనా దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకర్షించడానికి మరో బంపరాఫర్ని ప్రవేశపెట్టింది. ఇకపై తమ వినియోగదారులు లోన్ కోసం ఏ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని లక్షరూపాయల వరకు పర్సనల్ లోన్ మేమే ఇస్తామంటూ తెలియజేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తామంది. బెంగుళూరుకి చెందిన క్రెజిబి అనే ఫిన్ టెక్ సంస్థతో కలిసి MI క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్టును షియోమి ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా షియోమి వెయ్యి నుంచి లక్షరూపాయిల వరకు ఫోన్ యూజర్లు అప్పుగా అందుకోవచ్చని తెలియజేసింది. మరి ఈ అప్పు పొందాలంటే ఎలానో చూద్దాం..
.. షియోమి కస్టమర్లు ముందుగా MI క్రెడిట్ సర్వీస్లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
.. నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
.. పూర్తి చేసిన పది నిమిషాల్లోనే లోన్కు మీరు అర్హులా కాదా అన్న మెసేజ్ వస్తుంది.
.. అయితే తీసుకున్న మొత్తాన్ని 15 నుంచి 90 రోజుల మధ్యలో తీర్చేసేయాలి. 3 శాతం వడ్డీతో లోన్ ఉంటుందని షియోమి తెలిపింది.
మొబైల్ రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న షియోమీ భారతీయ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే టీవీలు కూడా విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ క్రెడిట్ స్కీమ్ని ప్లాన్ చేసింది.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







