షియామీ బంపర్ ఆఫర్.. ఫోన్ ఉంటే లక్షరూపాయల లోన్
- May 28, 2018
చైనా దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకర్షించడానికి మరో బంపరాఫర్ని ప్రవేశపెట్టింది. ఇకపై తమ వినియోగదారులు లోన్ కోసం ఏ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని లక్షరూపాయల వరకు పర్సనల్ లోన్ మేమే ఇస్తామంటూ తెలియజేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తామంది. బెంగుళూరుకి చెందిన క్రెజిబి అనే ఫిన్ టెక్ సంస్థతో కలిసి MI క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్టును షియోమి ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా షియోమి వెయ్యి నుంచి లక్షరూపాయిల వరకు ఫోన్ యూజర్లు అప్పుగా అందుకోవచ్చని తెలియజేసింది. మరి ఈ అప్పు పొందాలంటే ఎలానో చూద్దాం..
.. షియోమి కస్టమర్లు ముందుగా MI క్రెడిట్ సర్వీస్లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
.. నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
.. పూర్తి చేసిన పది నిమిషాల్లోనే లోన్కు మీరు అర్హులా కాదా అన్న మెసేజ్ వస్తుంది.
.. అయితే తీసుకున్న మొత్తాన్ని 15 నుంచి 90 రోజుల మధ్యలో తీర్చేసేయాలి. 3 శాతం వడ్డీతో లోన్ ఉంటుందని షియోమి తెలిపింది.
మొబైల్ రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న షియోమీ భారతీయ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే టీవీలు కూడా విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ క్రెడిట్ స్కీమ్ని ప్లాన్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







