స్టార్ ప్లేయర్స్పై కాసుల వర్షం.. 1.15 కోట్లకు దీపక్ హుడాను
- May 30, 2018
ప్రో కబడ్డీ ఆటగాళ్ళ వేలంలో తొలిరోజు స్టార్ ప్లేయర్స్పై కాసుల వర్షం కురిసింది. మను గోయత్ అత్యధిక ధర పలికాడు. గోయత్ను హర్యానా స్టీలర్స్ 1.51 కోట్లకు దక్కించుకోగా.. తెలుగు టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి 1.29 కోట్లకు అమ్ముడయ్యాడు. వేలంలో రాహుల్ చౌదరి కోసం గట్టిపోటీ నడిచింది. అయితే ఎఫ్బిఎం పధ్ధతిలో రాహుల్ను టైటాన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వీరి తర్వాత దీపక్ హుడా 1.15 కోట్లకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేయగా.. మరో స్టార్ ప్లేయర్ నితిన్ తోమర్ను 1.15 కోట్లకు పుణేరి పల్టాన్ దక్కించుకుంది. అలాగే రిషాంక్ 1.11 కోట్లు, ఫజల్ అట్రాచలి 1 కోటి, సురేందర్ నాడా 75 లక్షలు , సందీప్ దుల్ 66 లక్షలు, దీపాల్ నర్వాల్ 57 లక్షలకు అమ్ముడయ్యారు. రెండురోజుల పాట జరగనున్న వేలంలో దాదాపు 422 మంది ఆటగాళ్ళు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!







