స్టార్ ప్లేయర్స్పై కాసుల వర్షం.. 1.15 కోట్లకు దీపక్ హుడాను
- May 30, 2018
ప్రో కబడ్డీ ఆటగాళ్ళ వేలంలో తొలిరోజు స్టార్ ప్లేయర్స్పై కాసుల వర్షం కురిసింది. మను గోయత్ అత్యధిక ధర పలికాడు. గోయత్ను హర్యానా స్టీలర్స్ 1.51 కోట్లకు దక్కించుకోగా.. తెలుగు టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి 1.29 కోట్లకు అమ్ముడయ్యాడు. వేలంలో రాహుల్ చౌదరి కోసం గట్టిపోటీ నడిచింది. అయితే ఎఫ్బిఎం పధ్ధతిలో రాహుల్ను టైటాన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వీరి తర్వాత దీపక్ హుడా 1.15 కోట్లకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేయగా.. మరో స్టార్ ప్లేయర్ నితిన్ తోమర్ను 1.15 కోట్లకు పుణేరి పల్టాన్ దక్కించుకుంది. అలాగే రిషాంక్ 1.11 కోట్లు, ఫజల్ అట్రాచలి 1 కోటి, సురేందర్ నాడా 75 లక్షలు , సందీప్ దుల్ 66 లక్షలు, దీపాల్ నర్వాల్ 57 లక్షలకు అమ్ముడయ్యారు. రెండురోజుల పాట జరగనున్న వేలంలో దాదాపు 422 మంది ఆటగాళ్ళు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







