స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం.. 1.15 కోట్లకు దీపక్‌ హుడాను

- May 30, 2018 , by Maagulf
స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం.. 1.15 కోట్లకు దీపక్‌ హుడాను

ప్రో కబడ్డీ ఆటగాళ్ళ వేలంలో తొలిరోజు స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసింది. మను గోయత్‌ అత్యధిక ధర పలికాడు. గోయత్‌ను హర్యానా స్టీలర్స్‌ 1.51 కోట్లకు దక్కించుకోగా.. తెలుగు టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి 1.29 కోట్లకు అమ్ముడయ్యాడు. వేలంలో రాహుల్ చౌదరి కోసం గట్టిపోటీ నడిచింది. అయితే ఎఫ్‌బిఎం పధ్ధతిలో రాహుల్‌ను టైటాన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వీరి తర్వాత దీపక్‌ హుడా 1.15 కోట్లకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేయగా.. మరో స్టార్ ప్లేయర్ నితిన్ తోమర్‌ను 1.15 కోట్లకు పుణేరి పల్టాన్ దక్కించుకుంది. అలాగే రిషాంక్ 1.11 కోట్లు, ఫజల్ అట్రాచలి 1 కోటి,  సురేందర్ నాడా 75 లక్షలు ,  సందీప్ దుల్ 66 లక్షలు, దీపాల్ నర్వాల్ 57 లక్షలకు అమ్ముడయ్యారు. రెండురోజుల పాట జరగనున్న వేలంలో దాదాపు 422 మంది ఆటగాళ్ళు పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com