మలేసియా ప్రధానితో మోదీ భేటీ
- May 31, 2018
కౌలాలంపూర్: మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం మలేసియా చేరుకున్నారు. ఈ ఉదయం కౌలాలంపూర్ చేరుకున్న మోదీకి ఆ దేశ అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుత్రజయ వెళ్లి మలేసియా నూతన ప్రధాని మహతీర్ మహ్మద్ను కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మహతీర్కు మోదీ అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వ్యూహత్మాక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ బుధవారం ఇండోనేషియాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడోతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరిన ప్రధాని మోదీ.. మధ్యలో మలేసియాలో ఆగారు. మలేసియా నూతన ప్రధాని మహతీర్ను అభినందించేందుకు మోదీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. కౌలాలంపూర్ నుంచి మోదీ సింగపూర్ వెళ్తారు. రేపు షాంగ్రీ -లా డైలాగ్లో జరగబోయే వార్షిక భద్రత సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం తన పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగివస్తారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







