ఖతార్ వ్యాప్తంగా ఎంఈసీ తనిఖీలు
- May 31, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్స్ని ప్రారంభించింది. స్వీట్లు, నట్స్, గారాంగావ్ యాక్ససరీస్ వంటివాటిని విక్రయించే ఔట్లెట్స్ ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు ఖతార్ వ్యాప్తంగా జరుగుతున్నాయి. లా నంబర్ 8 - 2008 కన్స్యూమర్ ప్రొటెక్షన్కి తగ్గట్టుగా ఆయా ఔట్లెట్స్ పనిచేస్తున్నాయో లేదో ఈ తనిఖీల్లో గుర్తిస్తారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు, అలాగే పవిత్ర రమదాన్ మాసంలో ఈ తనిఖీలు జరగడం సర్వసాధారణం. మార్కెట్లో అక్రమాలకు తావు లేకుండా, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. ఇప్పటిదాకా జరిగిన తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటికి సంబంధించి 8 జరీమానాల్ని కూడా విధించారు. తూకంలో తేడాలు, అరబిక్ ఇన్వాయిస్లు లేకపోవడం వంటి ఉల్లంఘనల్ని ప్రధానంగా నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 3,000 నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







