ఖతార్ వ్యాప్తంగా ఎంఈసీ తనిఖీలు
- May 31, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్స్ని ప్రారంభించింది. స్వీట్లు, నట్స్, గారాంగావ్ యాక్ససరీస్ వంటివాటిని విక్రయించే ఔట్లెట్స్ ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు ఖతార్ వ్యాప్తంగా జరుగుతున్నాయి. లా నంబర్ 8 - 2008 కన్స్యూమర్ ప్రొటెక్షన్కి తగ్గట్టుగా ఆయా ఔట్లెట్స్ పనిచేస్తున్నాయో లేదో ఈ తనిఖీల్లో గుర్తిస్తారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు, అలాగే పవిత్ర రమదాన్ మాసంలో ఈ తనిఖీలు జరగడం సర్వసాధారణం. మార్కెట్లో అక్రమాలకు తావు లేకుండా, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. ఇప్పటిదాకా జరిగిన తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటికి సంబంధించి 8 జరీమానాల్ని కూడా విధించారు. తూకంలో తేడాలు, అరబిక్ ఇన్వాయిస్లు లేకపోవడం వంటి ఉల్లంఘనల్ని ప్రధానంగా నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 3,000 నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







