జూన్ 12 న డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక భేటీ
- June 02, 2018
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్తో భేటీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. ఈనెల 12న సింగపూర్లో తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. వైట్హౌస్లో ఉత్తరకొరియా దౌత్యవేత్త కిమ్ యోంగ్తో రెండు గంటలపాటు చర్చించిన ట్రంప్.. భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు రెండురోజులు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో న్యూయార్క్లో చోల్ చర్చలు జరిపారు. తమ దేశాధ్యక్షుడు పంపిన లేఖను ట్రంప్కు అందజేశారు. వైట్హౌస్ నుంచి చోల్ వెళ్లిపోగానే ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. 12న సింగపూర్ వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంతోనే అంతా అయిపోతుందని భావించడం లేదని, సానుకూల ఫలితం రావచ్చని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







