జూన్ 12 న డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక భేటీ
- June 02, 2018
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్తో భేటీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. ఈనెల 12న సింగపూర్లో తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. వైట్హౌస్లో ఉత్తరకొరియా దౌత్యవేత్త కిమ్ యోంగ్తో రెండు గంటలపాటు చర్చించిన ట్రంప్.. భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు రెండురోజులు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో న్యూయార్క్లో చోల్ చర్చలు జరిపారు. తమ దేశాధ్యక్షుడు పంపిన లేఖను ట్రంప్కు అందజేశారు. వైట్హౌస్ నుంచి చోల్ వెళ్లిపోగానే ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. 12న సింగపూర్ వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంతోనే అంతా అయిపోతుందని భావించడం లేదని, సానుకూల ఫలితం రావచ్చని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







