జూన్ 12 న డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక భేటీ
- June 02, 2018ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్తో భేటీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. ఈనెల 12న సింగపూర్లో తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. వైట్హౌస్లో ఉత్తరకొరియా దౌత్యవేత్త కిమ్ యోంగ్తో రెండు గంటలపాటు చర్చించిన ట్రంప్.. భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు రెండురోజులు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో న్యూయార్క్లో చోల్ చర్చలు జరిపారు. తమ దేశాధ్యక్షుడు పంపిన లేఖను ట్రంప్కు అందజేశారు. వైట్హౌస్ నుంచి చోల్ వెళ్లిపోగానే ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. 12న సింగపూర్ వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంతోనే అంతా అయిపోతుందని భావించడం లేదని, సానుకూల ఫలితం రావచ్చని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్