అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం
- June 03, 2018
భువనేశ్వర్ : ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం దీవి నుండి ప్రయోగించిన అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ప్రయోగించిన క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. అణు బాంబులను మోసుకుని వెళుతూ, 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఇది సులువుగా ఛేదిస్తుందని వెల్లడించారు. లాంచ్ ప్యాడ్-4 పై నుంచి ఉదయం 9.48 గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించామని, పూర్తి దూరాన్ని ఇది ప్రయాణించి, లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ అగ్ని-5 క్షిపణిని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఆరు సార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. తొలి పరీక్షను 2012 ఏప్రిల్ 19న జరుపగా, ఆరవదైన అగ్నిా 5 క్షిపణిని ఈ సంవత్సరం జనవరి 18న ప్రయోగించింది. క్షిపణి వెళ్లిన మార్గాన్ని, వేగాన్ని రాడార్లు, ట్రాకింగ్ పరికరాలు, అబ్జర్వేషన్ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







