అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం
- June 03, 2018
భువనేశ్వర్ : ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం దీవి నుండి ప్రయోగించిన అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ప్రయోగించిన క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. అణు బాంబులను మోసుకుని వెళుతూ, 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఇది సులువుగా ఛేదిస్తుందని వెల్లడించారు. లాంచ్ ప్యాడ్-4 పై నుంచి ఉదయం 9.48 గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించామని, పూర్తి దూరాన్ని ఇది ప్రయాణించి, లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ అగ్ని-5 క్షిపణిని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఆరు సార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. తొలి పరీక్షను 2012 ఏప్రిల్ 19న జరుపగా, ఆరవదైన అగ్నిా 5 క్షిపణిని ఈ సంవత్సరం జనవరి 18న ప్రయోగించింది. క్షిపణి వెళ్లిన మార్గాన్ని, వేగాన్ని రాడార్లు, ట్రాకింగ్ పరికరాలు, అబ్జర్వేషన్ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







