దుబాయ్:విల్లా స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు చిన్నారుల మునక
- June 03, 2018దుబాయ్:దుబాయ్లోని మిర్దిఫ్ ప్రాంతంలోని ఓ స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు. వీరిలో ఒకరు ఏడాదిన్నర బాలిక కాగా, మరొకరు రెండున్నరేళ్ళ బాలుడు. ఇఫ్తార్ విందు జరుగుతున్న సమయంలో చిన్నారులిద్దరూ ఆడుకుంటూ అక్కడి నుంచి వెల్ళిపోయి, మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. తమ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన తమకు, సిమ్మింగ్ పూల్లో విగత జీవులుగా తమ చిన్నారులు కన్పించారని వాపోయారు. సంఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా, పోలీసులు - రెస్క్యూ టీమ్ సకాలంలో స్పందించి, బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. చిన్నారుల మృతితో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం