క్యాన్సర్ హాస్పటల్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు...
- June 10, 2018
నటసింహ బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారుల సమక్షంలో జరుపుకున్నారు.. ఈ సందర్భంగా బాలయ్య 58 కేజీల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తో పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరంలో పలువరు బ్లడ్ డోనేట్ చేశారు.. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తన పుట్టినరోజున అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరమని అన్నారు. నందమూరి అభిమానులు ఇతరులకు ఆదర్శంగా ఉంటారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పం ఎన్టీఆర్ సొంతమని పేర్కొంటూ బసవతారకం ఆస్పత్రిలో అధునాతన పరికరాలు సమకూర్చామని వెల్లడించారు. 40 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి ఇప్పుడు 515 పడకలకు చేరిందని తెలిపారు.. రోజురోజుకూ క్ఆన్సర్ బాధితులు పెరుగుతుండటం బాధాకరంగా ఉందన్నారు. త్వరలోనే అమరావతిలోనూ కేన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నామని ప్రకటించారు.. కాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా పలువరు రాజకీయ, సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..