రోబో 2.0 సినిమా మరోసారి వాయిదా.
- June 11, 2018
సైన్స్ ఫిక్షన్ సినిమా 2.0. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తారాగణం. శంకర్ దర్శకుడు. మైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర నిర్మాణ వ్యయం సుమారు 450 కోట్లు. ఇంత బడ్జెట్తో భారతీయ సినిమా రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకునే దర్శకుడు శంకర్. రోబో (2010) విజయం ఇచ్చిన ఉత్సాహంతో 2.0 చిత్రాన్ని ప్లాన్ చేశారు. 2015లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడి ప్లానింగ్ ప్రకారం 2017లోనే ఈ సినిమా రిలీజ్ కావాలి. 2017 అక్టోబర్లో ఆడియోను దుబాయ్లో అట్టహాసంగా రిలీజ్ చేశారు. సినిమా విడుదల మాత్రం తరచుగా వాయిదా పడుతోంది. 2018 జనవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 27 అన్నారు. చివరగా ఆగస్టు 15న 2.0 ప్రేక్షకుల ముందుకువస్తుందని వెల్లడించారు. కానీ ఇదీ జరిగేట్టు లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల ఆరు నెలలు వాయిదా పడింది.
2019లోనే ప్రేక్షకుల ముందుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2.0 షూటింగ్ పార్ట్ మొత్తం ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ కబాలి, కాలా సినిమాలను పూర్తిచేశారు. తాజాగా కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు.
2.0 విడుదల ఆలస్యానికి సిజి వర్క్ పూర్తికాకపోవడం కారణం అని తెలుస్తోంది. దర్శకుడి సంతృప్తి మేరకు వర్క్ లేని కారణంగా మళ్లి మళ్లి చేయాల్సి వస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆలస్యం కారణంగా బడ్జెట్ కూడా అమాంతం పెరిగింది. తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







