4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్' ప్రదర్శన
- June 13, 2018సౌదీ అరేబియా:సిరియన్ అమెరికన్ దర్శకుడు ముస్తాఫా అక్కద్ రూపొందిన చారిత్రక చిత్రం 'ది మెసేజ్' నాలుగు దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ప్రదర్శితం కాబోతోంది. తన తండ్రి రూపొందించిన సినిమా విడుదలవుతున్నందుకు ఆనంంగా వుందని అక్కద్ కుమారుడు చెప్పారు. ప్రొఫెట్ మొహమ్మద్పై తీసిన ఈ సినిమా 1976లో విడుదలై అరబ్ ప్రపంచంలో సంచలనమే సృష్టించింది. సినిమా చుట్టూ వివాదాలు రావడంతో, అరబ్ ప్రపంచం ఈ సినిమాని బ్యాన్ చేసింది. గత ఏడాది సౌదీ అరేబియా సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో, సౌదీ అరేబియాలో సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సినిమాపై ఎన్ని వివాదాలున్నా, ఇది ప్రజాదరణ పొందిందని అక్కద్ కుమారుడు మాలిక్ ముస్తఫా అక్కద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!