ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా
- June 17, 2018
ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' హైదరాబాద్: 'గీతాంజలి' చిత్రంలో దెయ్యం పాత్రలో నవ్వులూ పూయిస్తూ భయపెట్టారు నటి అంజలి. 2014లో విడుదలైన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. హాస్యనటులు శ్రీనివాస్, మధునందన్, హర్షవర్ధన్ రానే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రచయిత కోనవెంకట్ 'గీతాంజలి 2' తీయబోతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రవాస భారతీయుడు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సన్నద్ధమైనట్లు చెప్పారు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







