గొంతులో ద్రాక్ష ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి
- June 19, 2018
యు.ఏ.ఈ:రెండేళ్ళ చిన్నారి గొంతులో ప్రమాదవశాత్తూ ద్రాక్షపండు ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈద్ తర్వాత మూడో రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. గొంతులో ద్రాక్షపండు ఇరుక్కుని, శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఖోర్ఫక్కాన్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్నారిని తమ ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా వుందనీ, ఆ చిన్నారిని బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా