స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన దుబాయ్ పోలీస్
- June 22, 2018దుబాయ్ పోలీస్, స్మార్ట్ మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మురాక్కాబాత్ పోలీస్స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యూఏఈలో ఇది తొలి ప్రాజెక్ట్ అని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. 2016-21 స్ట్రాటజిక్ ప్లాన్లో భాగంగా దుబాయ్ పోలీస్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టిందని అన్నారు. రికార్డ్ టైమ్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారాయన. ఈ ప్రాజెక్ట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కార్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?